Thursday, December 10, 2015

రైతులతో సర్కారు దొంగాట

కడప జిల్లాలో రైతులతో ఏపీ సర్కారు చెలగాటం ఆడుతోంది. పంటల బీమా గడువు ముగిసే దశలో కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి చోద్యం చూస్తోంది. కొత్త నిబంధనలపై రైతులతో పాటు బ్యాంకులకు కూడా సమాచారం లేకపోవడం మరీ విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం కావాలనే ఇలాంటి పనులు చేస్తోందని రైతులు మండిపడుతున్నారు.
       జిల్లాలో బుడ్డశనగ, వరి, జొన్న, వేరుశనగ పంటలకు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం , బీమా కంపెనీలు నోటిఫికేషన్ ఇచ్చాయి. ప్రీమియం డీడీల ద్వారా పంపాలని కోరాయి. పదిహేనో తేదీ తుది గడువుగా పేర్కొనడంతో.. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రీమియం కట్టేశారు. తాజాగా రైతు ఖాతాల ద్వారా ప్రీమియం చెల్లించాలనడం వివాదాస్పదమైంది.
      బుడ్డశనగ రైతులు మాత్రం రైతు ఖాతా ద్వారా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆలస్యంగా నోటిఫికేషన్ ఇచ్చింది. హడావిడిగా బ్యాంకులకు నోటీసులు పంపింది. మరోవైపు ఇప్పటికే ప్రీమియం కట్టిన రైతులు అయోమయంలో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకెలాంటి ఆదేశాలు రాలేదని వారు చెబుతున్నారు. రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

No comments:

Post a Comment