Tuesday, December 8, 2015

యూజర్ బాదుడుకు రంగం సిద్ధం

ఏపీలో మరో బాదుడుకు రంగం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలు పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండుసార్లు రెవిన్యూ స్టాంపు డ్యూటీ పెంచిన సర్కారు.. మళ్లీ యూజర్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కక్షిదారులపై భారీగా భారం పడనుంది. ప్రజల జేబులు చిల్లు చేస్తూ వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీలు రెవిన్యూ శాఖకు చేరట్లేదని విమర్శలున్నాయి.
            యూజర్ ఛార్జీలను భారీగా పెంచిన సర్కారు.. ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశిస్తోంది. పవర్ ఆఫ్ అటార్నీ యూజర్ ఛార్జీ యాభై రూపాయల నుంచి వందకు పెంచారు. లీజు, తనఖా, ఒప్పందాల రిజిస్ట్రేషన్ కోసం యూజర్ ఛార్జీ 20 రూపాయల నుంచి 100 రూపాయలకు పెంచారు. సొసైటీ బైలా సర్టిఫికేషన్ కు ప్రస్తుతం 35 రూపాయలు వసూలు చేస్తుండగా.. అది కూడా 100 రూపాయలకు పెంచారు.
            ఓవైపు సామాన్యుల ముక్కుపిండి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్న సర్కారు. రెవిన్యూ శాఖకు మౌలిక సదుపాయాల విషయంలో శీతకన్నేస్తోంది. చాలావరకు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కనీసం విద్యుత్, ఫోన్ బిల్లులకు కూడా సర్కారు డబ్బులివ్వకపోతే ఆయా సబ్ రిజిస్ట్రార్లే భరిస్తున్నారని రెవిన్యూ వర్గాలు చెబుతున్నాయి.
 

No comments:

Post a Comment