Friday, December 4, 2015

చిత్తూరులో ఉపకారానికి మంగళం

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా రెవిన్యూ కార్యాలయాలు పనిచేయడం లేదు. మామూలగానే ధృవీకరణపత్రాల కోసం నెలల తరబడి తిప్పుకునే అధికారులు.. ఇప్పుడు వర్షాల సాకుతో అసలుకే ఎసరు తెస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులకు అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.
         జిల్లాలో స్కాలర్ షిప్పులకు అర్హులైన విద్యార్థులు 80 వేల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 25 వేల మంది వరకు ఇంతవరకూ దరఖాస్తులు కూడా చేసుకోలేదు. వీరు విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ధృవీకరణ పత్రాల కోసం తిరుగుతున్నా ఇంతవరకూ చేతికి రాలేదు. వీరికి స్కాలర్ షిప్పులు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
        స్కాలర్ షిప్పుల కోసం ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన సర్కారు ఇప్పుడు మరోసారి పొడిగించేందుకు సిద్ధంగా లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

No comments:

Post a Comment