Tuesday, December 29, 2015

‘నిక్షేపం’గా దోపిడి

మూడు రాష్ట్రాల కూడలి  కుప్పంలో అక్రమ క్వారీలకు అడ్డు, అదుపూ లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో 150  క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో 40లోపు క్వారీ లకు వూత్రమే అనువుతులు ఉన్నారుు. అరకొరగా అనువుతులు ఉన్నవి, అసలు లేనివి కూడా పరిమితికి మించిన విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారుు. ఒకే పర్మిట్‌తో పదుల సంఖ్యలో లారీలు క్వారీ బ్లాకులను షిప్పు యూర్డులకు తరలిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయుం దళారుల ఖాతాలకు చేరుతోంది. కుప్పానికి చెందిన టీడీపీ నాయుకుడు జిల్లాలోని  క్వారీల యుజ వూనుల నుంచి గత వుూడు నెలల్లో రూ.100 కోట్లు వసూలు చేసినట్టు సొంత పార్టీ వారే  చెప్పుకున్నారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, పలవునేరు, కుప్పం ప్రాం తాల్లో విలువైన రాతి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా యి. గనుల శాఖ పరిధిలో 1200 వందల క్వారీలున్నాయి. ఇందులో 850 క్వారీల్లో తవ్వకాలు సాగుతున్నాయి.  దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఇక్కడి రాళ్లు ఎగువుతి అవుతున్నారుు. వీటి వ్యాపారంతోనే కోట్లు గడించిన వ్యాపార వేత్తలు, రాజకీయు నాయుకులు జిల్లాలో అనేక వుంది ఉన్నా రు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో పొరు గు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు ఇక్కడికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నారు. రాళ్లతో డాలర్ల పంట పండుతుండటంతో దీనికి సంబంధించిన అన్ని విషయూల్లో భారీగా నగదు చేతులు వూరుతోంది. రాళ్ల వ్యాపారులు ప్రభుత్వాన్ని, అధికార యుంత్రాంగాన్ని శాసిం చేంతగా ఎదిగారు. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

 
క్వారీల్లో పనిచేసే కార్మికుల బతుకులు గాల్లో దీపాలుగా వూరారుు. కనీస సదుపాయూలు, భద్రతా ప్రవూణాలు పాటించే వారు కరువయ్యా రు. రాతి క్వారీల్లో ప్రవూదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోరుునా, వికలాంగులుగా వూరినా నావువూత్రపు పరిహారంతో క్వారీ నిర్వాహకులు చేతులు దులుపు కొంటున్నారు. స్థానికులను పనిలో పెట్టుకుని ప్రవూదాలు జరిగితే ఇబ్బందు లు ఉంటాయున్న కారణంతో తమిళనాడు, చత్తీస్‌ఘడ్, బిహార్, ఒడిశాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. వారిలో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయూలు కూడా లేకపోవటంతో సహచరులు విగత జీవుతైనా, వికలాంగులైనా మిగతా వారు పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఎలాంటి బీవూ, ఈఎస్‌ఐ సదుపాయూలు లేవు.

No comments:

Post a Comment