Thursday, December 24, 2015

కల్తీ మద్యానికి మరొకరు బలి

కల్తీ మద్యానికి మరొకరు బలయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం మండెపూడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొండమూడి లింగారావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.

అర్ధరాత్రి దాటాక అనారోగ్యానికి గురవడంతో.. కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు బుధవారం మృతిచెందాడు. ఇదే ఆస్పత్రిలో మరో వ్యక్తి కూడా కల్తీ మద్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. విజయవాడ కల్తీమద్యం కేసు విచారణలో ఉండగానే.. ఇలాంటి ఘటనలు జరగడం అధికారుల నిర్లక్యానికి అద్దం పడుతోంది. 

రాజధాని పరిధిలోని స్వల్ప వ్యవధిలో రెండో సంఘటన జరగడం చిన్న విషయం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీలో కాల్ మనీపై మాట్లాడితే అమరావతి పరువు పోతుందని మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడీ కల్తీమద్యం వ్యవహారంపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలను అర్థం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దితే బాగుంటుందని, నేషనల్ గేమ్స్ బిడ్ వేయడంపై పెట్టిన శ్రద్ధ.. శాంతిభద్రతలపై పెట్టాలని చురకలు అంటిస్తున్నారు. 

No comments:

Post a Comment