Monday, December 14, 2015

గురుకులాలకు సవాలక్ష సమస్యలు

ఏపీ గురుకుల పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా జిల్లాల్లో గురుకులాలు అధ్వాన్న పరిసరాల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్యానికి తోడు అధికారుల నిర్లక్యం తోడై.. వెనుకబడిన వర్గాల విద్యార్థులు కష్టాలు పడాల్సి వస్తోంది.
ఉదాహరణగా అనంతపురం జిల్లాను పరిశీలిస్తే.. వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలు ఐదు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 14, గిరిజన సంక్షేమ గురుకులాలు 4, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు నాలుగు, ఏపీఆర్ఐఈ పాఠశాలలు 18 ఉన్నాయి. వీటిలో 14150 మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు అన్నింటిలోనూ సమస్యలున్నాయి.

 ప్రభుత్వం పది కోట్లు వెచ్చించి నిర్మించిన కొత్త గురుకులాల్లో కూడా తాగునీటి సమయ్ తీవ్రంగా ఉంది. నీరు ఉప్పగా ఉండటంతో తాగలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ముక్యం కణేకల్లు క్రాస్ వద్ద గురుకులం పరిస్థితి ఘోరంగా ుంది. వృథా నీరు పోయే మార్గం కూడా లేక స్కూల్ పరిసరాలు దుర్గంధం వెలువడుతోంది.  

No comments:

Post a Comment