Monday, December 14, 2015

గతుకుల రోడ్లు.. ప్రాణాలు హరీ


చిత్తూరు జిల్లాలో రోడ్లు సామాన్యుడి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. చంద్రగిరి మండలంలోని పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారి ప్రమాదాలకు చిరునామాగా మారింది. తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న చంద్రగిరి మండలం నుంచి వేలాది మంది రోజూ తిరుమల వెళ్తుంటారు. జాతీయ రహదారి గుండా బెంగళూరు, చిత్తూరు, వేలూరు వంటి నగరాలకు నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే మండలంలోని ప్రధాన మలుపు వద్ద నేషనల్ హైవే అధికారులు ఎలాంటి సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదు.

కల్ రోడ్డుపల్లి, మంగళి పట్టు, నాగాలమ్మకూడలి, మొరవవల్లి ప్రాంతాల్లో కూడా రోడ్లు గతుకుల మయంగా తయారైంది. రెండు నెలెల క్రితం దీపావళి పండుగ రోజున ఓ కుటుంబం బెంగళూరు నుంచి తిరుమల వస్తుండగా.. ప్రమాదం జరిగి.. భార్యాభర్తలు, కొడుకుతో సహా చనిపోయారు. 2013లో ఇదే రహదారిపై 67 రోడ్డుప్రమాదాలు జరిగాయి. ఇందులో 44 మంది చనిపోగా.. 65 మందికి తీవ్రగాయాలయ్యాయి. 2014లో 71 ప్రమాదాలు జరిగాయి. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 98 మంది గాయాలతో ఆస్పత్రిలో చేరరాు. 2015లో నవంబర్ వరకు 49 ప్రమాదాలు జరగగా.. 39 మంది మరణించారు. 59 మంది క్షతగాత్రులయ్యారు.

 చంద్రగిరి మండలంలోని మామండూరు వద్ద దాబాలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో లారీ డ్రైవర్లు వాహనాలు రోడ్డుమీదే పార్క్ చేస్తుండటంతో.. ప్రమాదాలు మరింత పెరిగిపోతున్నాయి. నేషనల్ హైవే అధికారులు ఇప్పటికైనా స్పందించి మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. లారీల పార్కింగ్ కూడా నేషనల్ హైవేపై కాకుండా.. లోపలకు పార్క్ చేసేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. 

No comments:

Post a Comment