Thursday, December 3, 2015

పోర్టు కోసం దేశం నేతల భూదందా

మచిలీపట్నం పోర్టు కోసం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ వివాదాస్పదమౌతోంది. సామాన్యరైతులు పొట్టకొట్టి వేలాది ఎకరాలు సేకరించి, పారిశ్రామికవేత్తలకు కట్టబెడతామనడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్రామాల్లో భూసేకరణపై అభిప్రాయ సేకరణకు ఏర్పాటుచేసిన సమావేశాలు విఫలమయ్యాయి.
      రైతుల్లో వ్యతిరేకతను గ్రహించిన మంత్రులు భూసేకరణ రద్దు చేస్తామని కొన్నిగ్రామాల్లో ప్రకటించారు. అయితే పేరుకే ప్రకటన చేశారు గానీ.. నిజంగా భూసేకరణ రద్దుచేయలేదు. దీంతో ఎప్పటికైనా తమ భూములు లాక్కుంటారని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.
       ఈలోగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి భూములు ఇచ్చేది లేదని చెప్పిన రైతులపై భౌతికదాడులకు దిగుతున్నారు. అదేమంటే వ్యక్తిగత గొడవలని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా తెలుగు తమ్ముళ్లకే వత్తాసు పలుకుతున్నారు.

No comments:

Post a Comment