Monday, December 14, 2015

తూతూ మంత్రంగా పంటనష్టం సర్వే



వర్షాభావంతో పంటల నష్టపోయిన రైతుల్ని.. ఏపీ సర్కారు నట్టేట ముంచుతోంది. పంట నష్టం సర్వేను క్రమపద్ధతిలో నిర్వహించకుండా.. తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకుంటోంది. పంట నష్టపోయిన రైతుల జాబితాలో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి అండగా ఉండే కొంతమంది రైతుల పేర్లతో జాబితాలు సిద్ధమయ్యాయి.

జాబితాలు గ్రామసభలో పెట్టి ఆమోదం తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నా.. ఆఊసే లేదు. కనీసం పంచాయతీ ఆఫీసుల్లో కూడా జాబితాలు ప్రదర్శించడం లేదు. నిబంధనలకు పూర్తిగా తిలోదకాలిచ్చారు. అధికార పార్టీకి మేలు జరిగే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల సర్వే తప్పులతడకగా ఉందని మండిపడుతున్నారు.

కర్నూలు జిల్లాలో ఆరు లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగుచేయాల్సి ఉండగా.. వానల్లేక లక్ష పైచిలుకు ఎఖరాల్లో పంటలే వేయలేదు. సాగుచేసిన భూముల్లో కూడా మూడు లక్షల పైచికులు ఎకరాల్లో పంటనష్టం జరిగింది. మొత్తం మీద జిల్లాకు 600 కోట్ల రూపాయల పరిహారం రావాలని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని 53 మండలాలకు.. 40 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. కరవు ప్రాంతాల్లో వేగంగా సర్వే చేయాలన్న ఆదేశాలతో.. అధికారులు కేవలం పదిహేను రోజుల్లోనే సర్వే ముగించేశారు. కేవలం రెండు లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని నివేదిక ఇచ్చిన అధికారులు 310 కోట్ల రూపాయలు ఇస్తే చాలని కాకిలెక్కలు కట్టారు. 

No comments:

Post a Comment