Friday, December 18, 2015

పేదోడికి బిల్లుల షాక్



ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 100 యూనిట్లలోపు విద్యుత్ బిల్లుల చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తున్నామని గత సర్కారు ప్రకటించింది. దీంతో ఊరట చెందిన పేదలకు.. ఇప్పుడు బకాయిలున్నారని నోటీసులు అందుతున్నాయి. ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై ఇందిరమ్మ కలలు కార్యక్రమం ద్వారా అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీ సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో.. బకాయిల నోటీసులిస్తూ బెంబేలెత్తిస్తున్నారు.
      ఉపప్రణాళికలో భాగంగా వంద యూనిట్ల లోపు వినియోగదారులకు బిల్లుల చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ క్రమంలో నెలకు ఓ యూనిట్ అధికంగా వాడినా బిల్లులు కట్టాలని విద్యుత్ అధికారులు నోటీసులిస్తున్నారు. పలువురు వినియోగదారులు గత రెండున్నరేళలో మినహాయింపులు పొందలేకపోగా.. రూ పదివేలు నుంచి ఇరవై వేల రూపాయల బకాయి ఉన్నట్లు వస్తున్న బిల్లులు చూసి ఆందోళన చెందుతున్నారు.
     ఉప్రణాళికలో రాయితీ పోనూ మిగతా బిల్లులను వినియోగదారులు చెల్లించాల్సిందేనని అధికారులు చావుకబురు చల్లగా చెబుతున్నారు. బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. సర్కారు నిధులు ఇవ్వడం లేదనే మాటను ఎక్కడా చెప్పకుండా అతి జాగ్రత్త పడుతున్నారు. 

No comments:

Post a Comment