Friday, December 18, 2015

అనంతలో మాఫీ మంటలు



రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేయడం, డ్వాక్రా, రైతు రుణాలు చెల్లించాలని బ్యాంకులకు నోటీసులివ్వడంతో.. కలకలం రేగుతోంది. విధిలేని పరిస్థితులు రైతులు, డ్వాక్రామహిళలు అధికవడ్డీలకు అప్పులు తీసుకుని తాత్కాలిక ఉపశమనం పొందారు. అయితే అప్పులు సకాలంలో తీర్చలేక కాల్ మనీ మాఫియా చేతులో తీవ్రక్షోభను అనుభవిస్తున్నారు. కొంతమంది లైంగిక వేధింపులకు కూడా గురయ్యారు.
     అనంతపురం జిల్లా వ్యాప్తంగా 52 వేల డ్వాక్రా సంఘాల్లో.. 5.40 లక్షల మంది సభ్యులున్నారు. వీరు 2014 ఎన్నికల నాటికి 990 కోట్లు బకాయిగా ఉన్నారు. వీటన్నింటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఒక్కో సంఘం నాలుగు నుంచి ఏడు నెలల వరకూ రుణాలు చెల్లించలేదు. అప్పులు చెల్లించాలని బ్యాంకర్లపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో రుణాలు మాఫీ కుదరదని, ఒక్కొక్కరికి పదివేలు అప్పుగా ఇస్తామని సర్కారు చావుకబురు చల్లగా చెప్పింది.
       దీంతో మహిళలు అనివార్యంగా వడ్డీవ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు చేశారు. ఇదే అదనుగా కాల్ మనీ మాఫియా చెలరేగిపోయింది. పదివేలు అప్పిచ్చి పదివారాల సమయం ఇచ్చారు. వెయ్యి వడ్డీ అని చెప్పి.. తొమ్మిది వేలే ఇచ్చారు. వారానికి  వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాలని మెలిక పెట్టారు. ఈ వడ్డీ భారం మోయలేక మహిళలు బెంబేలెత్తుతున్నారు. జిల్లావ్యాప్తంగా వడ్డీలు కట్టని మహిళలనిు కాల్ మనీ మాఫియా వ్యభిచార కూపంలోకి దించినా.. పోలీసులు మాత్రం పచ్చపార్టీ పెద్దలు బయటికి రాకుండా పావులు కదుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. 

No comments:

Post a Comment