ప్రభుత్వ అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లే పురపాలక సంఘంలో ఏఈగా పని చేస్తున్న శ్రీనివాస్పై తెలుగు దేశం పార్టీ నేత, కాంట్రాక్టర్ గోగినేని శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం దాడికి దిగారు.
బిల్లులకు సంబంధించి విషయంలో ఏఈతో వాగ్వాదానికి దిగిన శ్రీనివాసరావు ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అధికారిని అడ్డుకొని ఆయనపై దాడి చేశాడు. దీంతో కణితి వద్ద గాయం అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ వర్గాలు అక్కడికి చేరుకొని ఇద్దరికి రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నారు.
బిల్లులకు సంబంధించి విషయంలో ఏఈతో వాగ్వాదానికి దిగిన శ్రీనివాసరావు ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అధికారిని అడ్డుకొని ఆయనపై దాడి చేశాడు. దీంతో కణితి వద్ద గాయం అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ వర్గాలు అక్కడికి చేరుకొని ఇద్దరికి రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఎమ్మార్వో వనజాకిపై టీడీపీ ఎమ్మెల్యే చేయిచేసుకున్నా.. ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అందుకే ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. అధికారం ఉంది కదా అని విర్రవీగితే.. తర్వాత ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారని ప్రతిపక నేతలు మండిపడుతున్నారు.
No comments:
Post a Comment