ఆలయ ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మా దృష్టికి నిర్భయంగా తీసుకురావచ్చు.. వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం..’ ఇదీ కొన్ని నెలల కిందట గ్రీవెన్స సెల్ ఏర్పాటు చేస్తూ దుర్గగుడి ఈవో నర్సింగరావు చెప్పిన మాటలు. అయితే ఈ గ్రీవెన్స సెల్ నిర్వహణ మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. గ్రీవెన్స సెల్ అటకెక్కగా, ఫిర్యాదుల విభాగం అవినీతికి కేంద్రంగా మారింది. తమకు ఎదురైన విభాగాలపై భక్తులిచ్చిన ఫిర్యాదులను ఆలయ ఈవో దృష్టికి వెళ్లకుండా కొంత మంది సిబ్బంది అడ్డుపడుతూ, ఫిర్యాదులోచ్చిన శాఖ నుంచి అందిన కాడికి దండుకుంటున్నట్లు సమాచారం.
ఫిర్యాదుల పుస్తకంలో తాము ఎదుర్కొన్న సమస్యను, ఫోన్ నంబర్ను నమోదు చేస్తుంటారు. అయితే సమస్య పరిష్కారం కాకుండానే ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి అంతా సరి అయిందని చెబుతున్నట్లు తెలుస్తోంది. భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులను రెండు పుస్తకాలలో నమోదు చేయిస్తూ, ఓ పుస్తకం మాత్రమే ఆలయ ఈవో టేబుల్పైకి చేరుస్తున్నట్లు తెలిసింది.
No comments:
Post a Comment