కాగా కాల్మనీ సెక్స్ రాకెట్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులను తప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా పన్నాగాలు పన్నుతోందని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంట్లో అవసరాలకు అప్పు చేసిన మహిళలపై దారుణంగా వ్యవహరించడం అమానుషమని. అటువంటి వ్యాపారులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మహిళలను లైంగికంగా వేధించడంతో పాటుగా వారిని వీడియోలు తీయడం వంటివి చేయడం ప్రభుత్వం చేతకానితనం వలనే చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.
కాల్మనీ సెక్స్ రాకెట్లో సీఎం చంద్రబాబు తొలిముద్దాయిగా, పోలీసులు, వ్యాపారులను రెండు, మూడవ ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్లు వస్తున్నాయి. విజయవాడ పటమటలో జరిగిన ఘటనలో నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్న నేపథ్యంలో.. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తప్పించేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment