Monday, December 28, 2015

ఇద్దరూ అక్కడే.. పాలన ఎక్కడ..?

అమరావతి పరిధిలోకి వచ్చిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాలన పడకేసింది. కలెక్టర్లు బాబు, కాంతిలాల్ దండేలకు సమర్థ అధికారులుగా గుర్తింపు ఉన్నా.. వారు ఎక్కువగా రాజధాని పనులమీదే దృష్టి పెట్టడం కొత్త సమస్యలకు దారితీస్తోంది. కలెక్టర్ స్వయంగా చూసి సంతకం చేయాల్సిన ఫైళ్లు, అప్రూవళ్లు అన్నీ నిలిచిపోవడంతో ఈ రెండు జిల్లాల్లో జనం లబోదిబోమంటున్నారు.
    కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ప్రతి సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. దీనికి జిల్లా పరిధిలోని మండల అధికారులంతా తప్పనిసరిగా హాజరుకావాలి పాలనాపరంగా ఇది మంచిదే అయినా ఏకంగా రాత్రి పదకొండు గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ జరపడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
   ఇక గుంటూరు జిల్లాలో భూసమస్యలు, వివాదాలు ఎక్కువ. వీటిలో చాలా వరకు పెద్దతలకాయల ఫైళ్లు ఉన్నాయి. కొన్ని ఫైళ్లు ఎమ్మార్వోలు, ఆర్డీవోలు క్లియర్ చేసినా.. కీలక ఫైళ్లు కలెక్టర్ చూడాల్సి ఉంది. అయితే కాంతిలాల్ దండేకు తీరిక లేకపోవడంతో ఫైళ్లన్నీ కలెక్టరేట్లో పేరుకుపోయాయి.

No comments:

Post a Comment