Friday, December 4, 2015

లెక్క తప్పితే చిక్కులే

అనంతపురంలో టీడీపీ ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు. ప్రైవేట్ కంపెనీల నుంచి మామూళ్లు వసూలు చేయడంలో ఆరితేరిపోయారు. ఎవరైనా ఆయన చెప్పినట్లు డబ్బులు ఇవ్వకపోతే.. ప్రాజెక్టులు నిలిపివేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ ప్రజాప్రతినిధి యవ్వారం తట్టుకోలేక రెండు కంపెనీలు అనంతపురం నుంచి బిచాణా ఎత్తేశాయి. ధర్మవరం నియోజకవర్గం ఈయన వల్లే అభివృద్ధి చెందడం లేదని స్థానికులు భావిస్తున్నారు.
              చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పచ్చచొక్కాలకు రెక్కలు వచ్చాయి. ఇష్టారాజ్యంగా మామూళ్లు సాగిస్తూ.. అన్నివర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కరువు జిల్లాగా పేరుబడ్డ అనంతపురంలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని భావించి సర్కారు రెండు కంపెనీలకు పనులు అప్పగించింది.
             అయితే ధర్మవరం ప్రజాప్రతినిధి తనకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని కంపెనీలను బెదిరించాడు. వారు ఒప్పుకోకపోవడంతో సోలార్ ప్లాంట్ పనులు ఆపేయించాడు. ఇతడి ఆగడాలు భరిచంలేక ఢిల్లీ కంపెనీ తన ప్లాంట్ ఎమ్మిగనూరు తరలించగా.. తాజాగా చెన్నై కంపెనీకి కూడా కష్టాలు మొదలయ్యాయి. కనీసం చెన్నై కంపెనీ ప్లాంట్ అయినా తరలిపోకుండా సర్కారు కళ్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment