Monday, December 14, 2015

పోలవరంలోనూ తవ్వుతున్న అక్రమార్కులు



అక్రమార్జనకు, అడ్డగోలు దోపిడీకి అడ్డాగా మారిన నీరు-చెట్టు కార్యక్రమం ముగిసి ఆర్నెల్లు దాటుతున్నా.. అధికార పార్టీ నేతలు మాత్రం తవ్వకాలు ఆఫడం లేదు. చివరికి పోలవరం కుడి కాలువ గట్లను సైతం నిర్భీతిగా తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి లేకుండా గ్రావెల తవ్వకాలు సాగుతున్నూ.. నీటిపారుదల శాఖ, రెవిన్యూశాఖ అధికారులు నిద్ర నటిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కంసాలిగుంట, గొల్లగూడెంలో పోలవరం కుడికాలువ వద్ద గ్రావెల్ గుట్టలను జేసీబీలతో తవ్వి లారీల్లో తరలించేస్తున్నారు. రోజుకు వంద లారీలకు పైనే గ్రావెల్ తరలింపు జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అడ్డగోలు తవ్వకాల వల్ల గుట్టలు మాయమై ఇప్పుడు కాలువల పక్కన గోతులు దర్శనమిస్తున్నాయి. టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధి సోదరుడి కనుసన్నల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయనేది బహిరం రహస్యం.

అయితే మండల స్థాయి అధికారులు తమకేమీ పట్లనట్లు ఊరుకుంటున్నారు. అదేమంటే గ్రావెల్ తవ్వకాలు తమ దృష్టికి రాలేదని బొంకుతున్నారు. మరికొందరు అధికారులు.. అన్నీ తెలిసి ఎందుకు అడుగుతారని తప్పించుకుంటున్నారు. అధికార పార్టీకి ఐదేళ్లు మాత్రమే అధికారమిచ్చారని, యథేచ్ఛగా దోపిడీ చేయమని లైసెన్స్ ఇవ్వలేదని స్థానికులు మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment