Monday, December 28, 2015

అ.. అమ్మ, ఆ.. ఆకలి

అక్షరాలు రానివారు కూటి కోసం బాథలు పడుతున్న నేటి రోజుల్లో.. అక్షరాలు వచ్చినవారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. చిత్తూరు జిల్లాలో సాక్షర భారత్ కార్యక్రమంలో పనిచేస్తున్న విలేజ్, మండల కోఆర్డినేటర్ల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్న సామెతను గుర్తుచేస్తోంది. దాదాపు ఏడాది నుంచి వేతనాలు రాక వీరు ఆకలితో పస్తులుంటున్నారు.
   చిత్తూరు జిల్లాలో సాక్షర భారత్ కింద పదిహేనేళ్లలో నాలుగు లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చారు. సాక్షర భారత్ కింద విలేజ్ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు ఉంటారు. విలేజ్ కోఆర్డినేటర్లకు రెండు వేలు, మండల కోఆర్డినేటర్లకు ఆరువేలు జీతాలు చెల్లిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత సాక్షర భారత్ కు నిధులు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు.
    వచ్చేదే బొటాబోటీ జీతాలు, ఇక ఏడాది పైగా జీతమే రాకపోతే తామెలా బతకాలని సాక్షర్ భారత్ కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరు చూస్తుంటే.. మీ ఇంట్లో తినండి.. మా ఇంట్లో పనిచేయండి అన్నట్లుగా ఉందని వాపోతున్నారు.

No comments:

Post a Comment