Friday, December 11, 2015

మిర్చియార్డును కుదిస్తున్న సర్కారు

ఏపీ సర్కారు తన రైతు వ్యతిరేకతను బాహాటంగానే చాటుకుంటోంది. వైఎస్ హయాంలో వంద ఎకరాల్లో మిర్చియార్డుకు ప్రయత్నాలు చేస్తే.. ఇప్పుడు దాన్ని 30 ఎకరాలకు కుదిస్తున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మిర్చి అధికంగా పండిస్తారు. మిర్చి రైతుల వెసులుబాటు కోసం పెద్ద మిర్చి యార్డు నిర్మించాలని వైఎస్ భావించారు. తర్వాత సీఎం రోశయ్య శంకుస్థాపన చేశారు.
       దుర్గి దగ్గర వంద ఎకరాల్లో యార్డు వస్తుందని అప్పట్లో అధికారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా నర్సరావుపేట ఎంపీ రాయపాటి ముప్ఫై ఎకరాల్లో యార్డుకు మళ్లీ శంకుస్థాపన చేయిస్తామని చెప్పడం రైతులు విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. అసలు యార్డు ఎన్నిఎకరాల్లో వస్తుందనేది ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. రైతుల్ని మరోసారి మోసం చేస్తున్నారని విమర్శలువస్తున్నాయి.
        ఓసారి శంకుస్థాపన జరిగిన యార్డుకు.. మళ్లీ శంకుస్థాపన అంటే తిరకాసు వ్యవహారమేనని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రైతుల విషయంలో మంచి ట్రాక్ రికార్డు లేని చంద్రబాబు యార్డు స్థలాన్ని కుదించరని అనుకోవడానికి వీల్లేదని కొందరు రైతులు భావిస్తున్నారు. ఎంపీ ప్రకటన స్పష్టంగానే ఉందని, ఇంకా వంద ఎకరాలయార్డు వస్తుందనుకోవడం భ్రమేనని అంటున్నారు.

No comments:

Post a Comment