Sunday, December 20, 2015

ఉచితం ఉత్తుత్తినే

ఏపీ సర్కారు ఆర్భాటంగా జారీ చేసిన హెల్త్ కార్డులు నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు రూపాయి కట్టకుండా వైద్యసేవలు పొందవచ్చని అధికారులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఏకంగా గుంటూరు పెద్దాసుపత్రిలోనే కార్డులు చెల్లవని మొహంమీదే చెప్పేస్తున్నారు. కొంతమంది ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే వైద్యసేవలు అందుతున్నాయి.
      గుంటూరు జిల్లాలో ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 90 వేల మంది ఉన్నారు. వీరిలో మెజారిటీకి వైద్యసేవలు అందడం లేదు. గుంటూరు పెద్దాసుపత్రిలో వెనక్కి పంపుతుండటంతో.. ప్రైవేటు ఆస్పత్రులు కూడా అదేబాటలో నడుస్తున్నాయి. కార్డులు జారీచేసి ఏఢాది అయినా ఇంతవరకూ వైద్యసేవలు అందకోవడంపై అసంతృప్తి వ్యక్తమౌతోంది.
      అటు ప్రభుత్వ పాలసీలో లోపం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న వ్యాధులకే ఉచిత వైద్యం అనడం సబబు కాదంటున్నారు. ఉద్యోగుల జీతంలో నెలనెలా కార్డుల కోసం కొంత సొమ్ము మినహాయించుకుంటున్న సర్కారు.. ఆస్పత్రుల్లో వైద్యం అందించకుండా దోబూచులాడుతోందని ఉద్యోగులు మండిపడుతున్నారు.

No comments:

Post a Comment