Tuesday, December 8, 2015

విన్నపాలు పట్టని పచ్చ చొక్కాలు

ఏపీలో సంక్షేమ రాజ్యం తెస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సీఎం అయ్యాక పేదలను గాలికొదిలేశారు. జన్మభూమి కమిటీలకు వేల సంఖ్యలో రేషన్ కార్డులు, తెల్లకార్డుల కోసం దరఖాస్తులు వచ్చినా వాటిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తెలుగు తమ్ముళ్లు సొంత పనులు చేసుకుంటూ. పేదలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
           రేషన్ కార్డులు అందక దారిద్ర్య్రేఖకు దిగువన ఉన్నవారి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వికలాంగులు మరీ ఇబ్బంది పడుతున్నారు.. అసలే కరువు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులు, వారిపై ఆధారపడే రైతుకూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. వీరి కష్టాలకు రేషన్ కష్టాలు తోడవడంతో బతడకడమే కష్టంగా ఉందని వాపోతున్నారు.
            అమరావతి పేరుతో త్రీడీ సినిమా చూపిస్తున్న చంద్రబాబు.. వాస్తవంలోకి వచ్చి ప్రజల్ని ఆదుకోవాలని జనం కోరుతున్నారు. ఏపీలో జనం ఆకలికి తాళలేక చచ్చిపోతుంటే.. మంత్రులు మాత్రం అంతా బాగుందని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటున్నారు. ప్రభుత్వం భ్రమలు వదిలేసి వాస్తవంలో బతకాలని కోరుతున్నారు. 

No comments:

Post a Comment