Thursday, December 3, 2015

కర్నూల్లో మట్కా రాకెట్

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో తెలుగు తమ్ముళ్లు మట్కా మాఫియాకు తెరతీశారు. గతంలో తెరచాటుగా జరిగిన బాగోతాన్ని ఇప్పుడు బహిరంగపరిచారు. ఏకంగా పోలీసులతో కుమ్మక్కై.. వారికి మామూళ్లు ఇస్తూ.. తామూ కొంత సంపాదించుకుంటున్నారు. మట్కాను నిషేధిస్తామన్న సర్కారు మాటలు నీటిమూటలే అవుతున్నాయి.
       కర్నూలు ఆదోని, నంద్యాల, డోన్ ప్రాంతాల్లో మట్కా మాఫియా జోరుగా నడుస్తోంది. గతంలో ఓ న్యాయవాది ద్వారా పోలీసులకు మాామూళ్లు అందేవి. అయితే కొత్తగా బదిలీ అయి వచ్చిన ఓ పోలీస్ అధికారి.. ఈ పద్ధతి మార్చేసి.. తెలుగు తమ్ముళ్ల ద్వారా మామూళ్లు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇదే అదనుగా టీడీపీ కార్యకర్తలు తాము కొంత దోచేసి.. మిగలింది పోలీసులకు పంచుతున్నారు.
         మట్కా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నా ఉన్నతాధికారులు ఎవరూ దాని జోలికి పోరు. ఎందుకంటే టీడీపీ సీనియర్ నేతలంతా ఆ మట్కా మాఫియాలో పాత్రధారులే. తాము తెరవెనుకే ఉంటూ పీఏల ద్వారా చక్రం తిప్పుతున్నారు.

No comments:

Post a Comment