Friday, December 4, 2015

గౌరవ వేతనం గుటకాయ స్వాహా

గ్రామీణ ఆరోగ్యానికి చుక్కానిగా నిలిచే ఆశా కర్యకర్తలకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఆశా కార్యాకర్తలకు ఏడేళ్లుగా ఓ క్వార్టర్ గౌరవ వేతనం ఎగ్గొడుతున్నారు. ఆశా కార్యకర్తలకు ఇచ్చేదే నాలుగు వందల రూపాయల జీతం.. అందులో కూడా కొట్టేస్తున్నారని, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
           2007 నుంచి ఈ తంతు కొనసాగుతోంది. జిల్లాలోని 16 ప్రాథమికఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 605 మంది ఆశా కార్యకర్తలున్నారు. వీరికి ఇప్పటివరకు 57 లక్షల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. ఎప్పటికప్పుడు మాయమాటలు చెబుతున్న అధికారులు తమ డబ్బులు ఇవ్వడం లేదని ఆశాలు ఆరోపిస్తున్నారు.
    గ్రామాల్లో ఆశాలే ప్రభుత్వ డాక్టర్లు, నర్సులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నారు. ఎన్నో అంటురోగాలు ప్రబలకుండా జాగ్రత్తుల తీసుకుంటారు. గర్భిణులు, బాలింతలను కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆశాలకు జీతాలు పెంచకపోతే ఉన్న వేతనం ఎగ్గొట్టడమేమిటని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి

No comments:

Post a Comment