Wednesday, December 2, 2015

గుంటూరులోే దేశం మార్కు బదిలీలు

రాజధాని నేపథ్యంలో గుంటూరు కార్పోరేషన్ కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అలాంటి చోట కమిషనర్ గా సమర్థుడైన అధికారులను నియమించాలని సర్కారు భావించింది. అయితే నిజాయితీపరులను ఎక్కువకాలం పనిచేయకుండా.. స్థానిక టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారు. ఏడాదిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ కావడం పచ్చచొక్కాల పాలిటిక్స్ కు అద్దం పడుతోంది.
           గుంటూరు నగరంలో మొదట్నుంచీ రాజకీయాలు ఎక్కువ. అందుకే నగరం ఆశించనివిధంగా అభివృద్ధి చెందలేదనే భావన స్థానికుల్లో ఉంది. ఇప్పుడు పుణ్యమా అని అభివృద్ధి చెందుతుందని భావిస్తుంటే.. స్థానిక ప్రజాప్రతినిధులో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నిజాయితీగా పనిచేస్తున్న కన్నబాబు, అనూరాధ వంటి కమిషనర్లను తొమ్మిది నెలల వ్యవధిలో బదిలీ చేయించారు.
    కమిషనర్ అనూరాధ బదిలీ వెనుక టీడీపీ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ గెలిచిన ఓ ఎంపీ కమిషనర్ ను బదిలీ చేయించడానికి సీఎం పేషీలో చక్రం తిప్పారు. మరోవైపు బాగా పనిచేస్తున్న కమిషనర్ ను బదిలీ చేయడంపై ఓ మంత్రితో పాటు కొంతమంది టీడీపీ మాజీ కార్పోరేటర్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇలా అయితే కార్పోరేషన్ ఎన్నికలకు ఏముఖం పెట్టుకుని వెళతామని ప్రశ్నిస్తున్నారు.

No comments:

Post a Comment