Thursday, December 3, 2015

రేషన్ కార్డులకు పచ్చ గ్రహణం

ఇసుక మాఫియా, మద్యం మాఫియా, రహదారి మాఫియా, ఇలా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో పుట్టకొచ్చిన మాఫియాలకు కొత్త మాఫియా జత కలిసింది. ప్రకాశం జిల్లాలో రేషన్ మాఫియా నడుస్తోంది. రేషన్ మాఫియా అంటే.. రేషన్ సరుకులు పక్కదారి పట్టించడం పాత పద్ధతి. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు కొత్త పద్దతి కనిపెట్టారు. ఈ పద్ధతి ద్వారా దర్జాగా కార్డుదారుల నెత్తిన చేయిపెట్టినా ఎవ్వరూ ఏమీ చేయలని పరిస్థితి కల్పించారు.
            రేషన్ కార్డుల్లో రెండు రకాలుంటాయి. తెలుపు, గులాబీ. అత్యంత వెనుకబడిన వర్గాలు, పేదలకు ఇచ్చే తెలుగు కార్డులను తమకు కావాల్సిన వారికి ఇచ్చేలా టీడీపీ నేతలు పావులు కదిపారు. తహసీల్దార్ కార్యాలయంలో తిష్టవేసి తెల్లకార్డు నంబర్లకు పింక్ కార్డుదారుల ఫోటోలు, వివరాలు చేర్చేచి, కార్డులు ట్యాంపరింగ్ చేస్తున్నారు. దీంతో అసలైన అర్హులకు రేషన్ సరుకులు అందక లబోదిబోమంటున్నారు.
           ఏకంగా తహసీల్దాలర్ యూజర్ ఐడీతోనే ఈ తతంగం అంతా జరుగుతున్నా.. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పైగా మీ రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అవలేదని, ఆన్ లైన్లో యాక్టివేట్ కావడం లేదని హరికథలు చెబుతున్నారు.

No comments:

Post a Comment