Friday, December 11, 2015

స్థానిక సంస్థలు అథోగతి

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన స్థానిక సంస్థలు పాలకుల పుణ్యమా అని కునారిల్లుతున్నాయి. కృష్ణా జిల్లాలో మండల పరిషత్ ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు విడుదల చేయకపోవడం, కేంద్రం నుంచి కూడా గ్రాంట్ రాకపోవడంతో.. నిధుల్లేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల ఆర్థికసంఘం నిధులు రిలీజైన అవి కరెంటు బిల్లు, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయినట్లు తెలుస్తోంది.
           రాష్ట్రాలను గుర్తించడం లేదని, తమ వాటా తమకు పంచడం లేదని కేంద్రంపై కొట్లాడే రాష్ట్రాలు.. స్థానికసంస్థలపై మాత్రం శీతకన్నేస్తున్నాయి. నిధులున్నా, లేకపోయినా వాటిని చిన్నచూపు చూస్తున్నాయి. మండల పరిషత్ అభివృద్ధి పనులు చేపట్టే వీలు లేకుండా నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నాయి. నిధుల్లేనప్పుడు మండల పరిషత్ ఉన్నా.. ఫలితం లేదని ఎంపీడీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
         ఇటీవల 13,14 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదలయ్యాయి. అయితే ఆ నిధులు సగం కరెంటు బిల్లులకు, మరో 25 శాతం సిబ్బంది జీతభత్యాలకు సరిపోయాయి. మిగిలిన నిధులతో గ్రామాల్లో ఉపాది హామీ పనుల కింద సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అయితే మండల పరిషత్ కోటా కింద పైసా రాకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment