Thursday, December 10, 2015

సర్పంచ్ లపై సర్కారు పెత్తనం

ఏపీలో సర్పంచ్ లపై సర్కారు పెత్తనం పెరిగిపోతోంది. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో పనులన్నీ సర్పంచ్ ను పర్యవేక్షించనీయకుండా చేస్తోంది. ఇప్పుడు చెక్ పవర్ కూడా సర్పంచ్ కు లేకుండా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కట్టబెట్టడం వివాదాస్పదమైంది. రాజ్యాంగం ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన అధికారాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది.
        14వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేసింది. ఆర్థిక సంఘం నిధులకు, ఉపాధి హామీ నిధులు కలిపి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా రోడ్ల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను పంచాయతీ రాజ్ శాఖ అధికారుల ఖాతాకు మళ్లించడం, వారికే చెక్ పవర్ కట్టబెట్టడంపై సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
      సర్కారు ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో తమ నెత్తిన పరోక్ష శక్తులను కూర్చోబెట్టిందని, ఇప్పుడు ఉన్న చెక్ పవర్ కూడా తీసేస్తే.. ఇక సర్పంచ్ కు విలువేం ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. సర్కారు వైఖరి మార్చుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment