తెనాలిలో మొత్తం 40 వార్డులున్నాయి. ఇక్కడ అనేక మంది పేదలు నివశిస్తున్నారు. వీరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే ఉద్ధేశంతో దివంగత వైఎస్ అప్పట్లో భావించారు. అందులో భాగంగా అప్పటి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పెదరావూరు సమీపంలో సుమారు 40 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు రైతులు దీనిపై కోర్టును ఆశ్రయించగా మరి కొందరు స్వచ్ఛందంగా భూమిని ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆ స్థలంలో అపార్ట్మెంట్లను ని ర్మించి పేదలకు ఇవ్వాలని భావించారు. ఎంపికైన లబ్ధిదారుడు ప్రభుత్వానికి రూ.50 వేలు చెల్లిస్తే ప్రభుత్వం బ్యాంకర్ల సాయంతో దానిని నిర్మించి పేదలకు అందజేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులకు తెలిసింది.
దీంతో కొందరు స్థానిక సంస్థల ప్ర జా ప్రతినిధులు, నాయకులు వసూళ్ళ పర్వానికి తెర తీశారు. లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే తమ ఆమోదం లేకుండా కుదరదని పేదలను నమ్మిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒక్కో పేదవాడి నుంచి రూ.10 వేల నుంచి రూ.25 వేల వర కు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో దళారి రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
No comments:
Post a Comment