Friday, December 11, 2015

గోదావరి డిెల్టాకు ప్రమాద ఘంటికలు

గోదావరి డెల్టాలో నీటి కరవు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన ఏపీ సర్కారు మాటలు.. నీటిమూటలేనని తేలబోతోంది. గోదావరి డెల్టాలో రబీ పంటకు నీరివ్వడం కష్టమేనని ఏపీ జెన్ కో అధికారులు తేల్చిచెబుతున్నారు. సర్కారు చెప్పినట్లుగా నీళ్లిస్తే మూడు విద్యుత్ కేంద్రాలు మూతపడతాయని, అప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
        రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరొందిన గోదావరి డెల్టాలో లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఖరీఫ్ పంటకు బాగానే నీరిచ్చిన అధికారులు.. రబీ వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. మొత్తం మీద 87 టీఎంసీల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం అందులో సగమే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు.
          గతంలో ఒడిషాకు విద్యుత్ ఇచ్చి సీలేరు నుంచి నీరు తీసుకొస్తామని చెప్పినా ఆ మాటలు ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదు. గతంలో అధికారులు 75 టీఎంసీల నీరు సేకరించవచ్చని లెక్కలు కట్టారు. అదనపు 12 టీఎంసీల నీరు ఒడిషా నుంచి తీసుకుని విద్యుత్ ఇవ్వచ్చని అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే.. అధికారుల లెక్క పూర్తిగా తప్పింది. అసలు 75 టీఎంసీలే లేనప్పుడు.. ఇక అదనపు మాటేంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.

No comments:

Post a Comment