ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మహిళా
సాధికారిత బూటకమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం
విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం, అంగన్ వాడీలను ఉద్యోగాల
నుంచి తొలగించడం మహిళా సాధికారితా అని ప్రశ్నించారు.
మహిళలకు ఇసుక్ రీచ్ లు అప్పగించే పేరుతో టీడీపీ నేతలు ఇసుక మాఫియా నడుపుతున్నారని తమ్మినేని సీతారాం విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులు ముమ్మాటికీ టీడీపీ నేతలేనని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న అంగన్ వాడీలకు జీతాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
మహిళలకు ఇసుక్ రీచ్ లు అప్పగించే పేరుతో టీడీపీ నేతలు ఇసుక మాఫియా నడుపుతున్నారని తమ్మినేని సీతారాం విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులు ముమ్మాటికీ టీడీపీ నేతలేనని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న అంగన్ వాడీలకు జీతాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
అంగన్ వాడీలను గతంలో గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు.. ఇప్పుడు వారి ఉద్యోగాలు తొలగిస్తూ.. జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంగన్ వాడీల ఉసురు తగిలే చంద్రబాబు గతంలో అదికారం కోల్పాయారని, ఈసారి కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.
No comments:
Post a Comment