Thursday, December 24, 2015

కాల్‌మనీని పక్కదారి పట్టించేందుకే రోజా సస్పెన్షన్


అసెంబ్లీ సమావేశాల్లో కాల్‌మనీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే కుట్రపూరితంగా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ వ్యవహారంలో నింధితులందరూ టీడీపీ వాళ్లేనని, వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు.

శాసనసభలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సరికాదన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెట్టడం నరసరావుపేటకు మచ్చగా మిగులుతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన బిల్లులు, ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా వాటి గురించి పట్టించుకోకుండా పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికే అధికార, ప్రతిపకాలు ప్రాధాన్యత ఇచ్చాయన్నారు. 

రోజాపై సస్పెన్షన్ అన్యాయమని వాదిస్తున్న వైసీపీకి.. కాంగ్రెస్ మద్దతు తోడవంతో.. అధికార పార్టీ ఇరుకున పడ్డట్లు కనిపిస్తోంది. వైసీపీ నేతలే కాకుండా పలు వర్గాల నుంచి రోజా సస్పెన్షన్ పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. రోజా అభ్యంతరకర భాష వాడిన సీడీ రిలీజ్ చేశాక కూడా.. రోజా ఎవరికో కౌంటర్ ఇస్తున్నట్లుగా ఉందని, రోజా మాటల కంటే ముందు అధికార పార్టీ వైపు నుంచి ఏం మాటలు వచ్చాయో వినిపించకుండా ఎడిట్ చేశారనే వాదన వినిపిస్తోంది.  

No comments:

Post a Comment