Sunday, November 8, 2015

రైతుల దెబ్బకు మంత్రి పరార్..!

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తాగునీరు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రజాప్రతినిధులకు సమస్యలు చెప్పుకున్నా.. ఫలితం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు ప్రత్తిపాడు మీదుగా పెదనందిపాడు వెళుతున్నారన్న సమాచారం తెలుసుకున్న రైతులు, ప్రజలు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలిసిన మంత్రి కాన్వాయ్ ను మినీ బైపాస్ మీదుగా దారి మళ్లించారు
     పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది నియోజకవర్గంలో కొంతకాలంగా పంటలకు సాగునీరు, తాగడానికి తాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, మంత్రిని నిలదీద్దామనుకుంటే పోలీసులు కూడా అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని స్థానికులు ఆరోపించారు. రోడ్డుపై రైతులున్నారని తెలిసి కూడా మంత్రి దొడ్డిదారిన వెళ్లడం. ఇలాంటి నేతలను గెలిపించడం తమ దౌర్బాగ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
        పంటలు పండక, సాగునీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలు కూడా సరిగా జరగడం లేదని నిరసన తెలిపారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకోవడం సబబు కాదన్న పోలీసులతో.. రైతులకు వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న రైతులు.. అక్కడ్నుంచి వెనుదిరిగారు.

No comments:

Post a Comment