Wednesday, November 18, 2015

అనంతలో అంతులేని అవినీతి

నిప్పులాంటి మనిషిని అని చెప్పుకునే సీఎం చంద్రబాబు మాటలు ఒట్టిమాటలే అని తేలిపోతోంది. అనంతపురం జిల్లాలో అవినీతి జలగలు తాండవిస్తున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా.. బాధ్యులను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారుల అవినీతికి, పచ్చ చొక్కాల పర్సంటేజీలు తోడవడంతో వ్యవహారం గప్ చుప్ గా సాగిపోతోంది.
     అనంతపురం కార్పొరేషన్ డబ్బులో ప్రజాప్రతినిధులకు డీజిల్ పోయించినా, కస్తూర్బా స్కూళ్లలో వసతులు సరిగా లేవని ఫిర్యాదులు వచ్చినా, ఎంపీ నిధులతో షెడ్డు నిర్మించి కార్పొరేషన్ అధికారులు సొమ్ము చేసుకున్నా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో కుంభకోణాలు జరిగినా, వీటన్నింటికీ పక్కా సాక్ష్యాలున్నా తమ్ముళ్లు లైట్ తీసుకుంటున్నారు. సర్కారు కూడా ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తోంది.
           కరవు జిల్లాగా పేరుబడ్డ అనంతపురంలోనే ఈ స్థాయి అవినీతి జరుగుతుంటే.. ఇక మిగిలిన జిల్లాల పరిస్థితేంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.ప్రజోపయోగ కార్యక్రమాలకు డబ్బుల్లేవని బీద అరుపులు అరిచే ప్రభుత్వం.. అవినీతిని మాత్రం ఇష్టారాజ్యంగా ప్రోత్సాహిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

No comments:

Post a Comment