Monday, November 23, 2015

రాజధాని రైతుల చెవిలో నారాయణ పువ్వు

రాజధాని భూసమీకరణలో హల్చల్ చేసిన ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తర్వాత పత్తా లేకుండా పోయారు. భూములిస్తే అవిస్తాం.. ఇవిస్తాం అని ఊదరగొట్టి.. ఇప్పుడు కనీసం తమవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భూములిచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములిచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ముప్ఫై లక్షల రూపాయలు ఇప్పిస్తామని నమ్మబలికారని, ఇప్పుడు పైసా విడుదల కావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు.
             చరిత్రలో ఎక్కడా జరగని విధంగా భూసమీకరణ చేశామని గొప్పలు చెప్పుకున్న సర్కారు.. భూములిచ్చిన రైతుల్ని నిండా ముంచింది. భూసమీకరణ జరిగినన్ని రోజులూ రైతుల చుట్టూ తిరిగిన మంత్రులు, అధికారులు ఇప్పుడు వారెవరో తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. భూసమీకరణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రి నారాయణ రేయింబవళ్లు గ్రామాల్లో పర్యటించి రైతులకు అనేక హామీలు ఇచ్చారు.
          రాజధాని ప్రాంతాల్లో అత్యున్నత మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ప్రతి ఇంటికీ ఎల్ ఈడీ బల్బులు అందజేస్తామని ఊదరగొట్టారు. అందర్నీ నమ్మించడం కోసం కొన్నిచోట్ల అప్పటికప్పుడు పనులు చేయించారు. అయితే ఎప్పుడైతే భూసమీకరణ పూర్తైందో.. అప్పట్నుంచి రాజధాని రైతుల్ని పట్టించుకోవడం మానేశారు. అధికారులు కూడా మంత్రుల బాటలోనే నడుస్తున్నారు. ప్రభుత్వ సాయం అందకపోతే వ్యతిరేకత వస్తుందని స్థానిక టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

No comments:

Post a Comment