Friday, November 20, 2015

వరద నష్టంపై సర్కారు కాకిలెక్కలు

వరదను ముందుగా అంచనా వేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలమైన సర్కారు.. కనీసం వరదనష్టం అంచనాలు వేయడంలో కూడా విఫలమైంది. ఏపీలో వారం రోజులుగా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లా అస్తవ్యస్తమైంది. జిల్లాలోని కాళంగి, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలుగు గంగ కాల్వకు గండిపడి నీరు వృథాగా పోతోంది, పీలేరు నియోజకవర్గంలో మేడిపల్లి జలాశయానికి కూడా గండి పడింది.
             క్షేత్రస్థాయిలో పరిస్థితి తీవ్రతను గుర్తించని అధికారులు జిల్లా కేంద్రం చిత్తూరులో కూర్చుని పంటనష్టం అంచనాలు తయారుచేస్తున్నారు. కనీసం గ్రామాల్లో తిరిగి వివరాలు తీసుకున్న నాథుడే లేడు. ఎకరాకు ముప్ఫై నుంచి ముప్ఫై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులు పంట నష్టపోయి లబోదిబోమంటున్నారు. అియితే అధికారులు మాత్రం కాకిలెక్కుల తయారుచేసి సర్కారుకు పంపారు.
                  దెబ్బతిన్న ఇళ్లు, చనిపోయినవాళ్లు, పంటనష్టం ఇలా అన్ని అంశాల్లోనూ వాస్తవానికి విరుద్ధంగా అధికారుల లెక్కలున్నాయి. అధికారుల లెక్కలు చూసిన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు సాయం చేయకపోగా.. వచ్చే సాయాన్ని కూడా రానీయకుండా అంచనాలు తారుమారుచేశారని మండిపడుతున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పుకోవడమే కానీ, తమ గురించి ఆలోచించేవారెవరూ లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment