Sunday, November 15, 2015

చిలకలూరిపేటలో రేషన్ బియ్యం మాఫియా

రేషన్ పంపిణీలో అవకతవలకలు చెక్ పెడతామని ఈపాస్ విధానాన్ని అమలుచేస్తున్నఏపీ  సర్కారు.. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కితగ్గడం లేదు. పైగా ఈపాస్ విధానం వచ్చాక ఖజానాకు బోలెడు డబ్బు ఆదా అవుతోందని గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఇదంతా బూటకమేనని తేలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టుబడుతున్న అక్రమ బియ్యం నిల్వలు సర్కారును వేలెత్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట బియ్యం మాఫియాకు కేంద్రస్థానంగా మారింది. 
               పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు... ఇలా జిల్లా ఏదైనా.. ఎక్కడ అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నా.. సరుకు మాత్రం చిలకలూరిపేట వ్యాపారులదే అని తేలుతోంది. ముందు కోస్తాలోని నాలుగు జిల్లాలకే పరిమితమన రేషన్ బియ్యం మాఫియా అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారుల అండతో.. రాయలసీమ జిల్లాలకు కూడా విస్తరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
                    చిలకలూరిపేటలో బియ్యం దందా నడుస్తోందని, దీనికి టీడీపీ నేతల దన్ను ఉందని రెవెన్యూ అధికారులకు తెలిసినా.. ఏమీ తెలియనట్లు నిద్రనటిస్తున్నారని విమర్శలున్నాయి. కొంతమంది అధికారులు కూడా నేతలతో చేతులు కలిపి పర్సంటేజీలకు అలవాటు పడటంతో.. ఇక దళారులు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి కొనసాగుతోంది. త్వరలో బియ్యం ధరలు పెరుగుతాయని హెచ్చరికలు వస్తున్నా.. సర్కారు మాత్రం అక్రమ రేషన్ బియ్యం మాఫియాను కట్టడి చేయకుండా చోద్యం చూస్తోంది. 

No comments:

Post a Comment