Wednesday, November 18, 2015

సర్కారు నిర్లక్ష్యంతో రోడ్డుకు గండి

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లకు కూడా గండిపడింది. అయితే కొన్ని రోడ్లకు సహజంగా గండి పడగా.. చాలాచోట్ల అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. గుంటూరు జిల్లా నగరం మండలంలో ఓ రోడ్డుకు పడిన గండి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎప్పుడో వేసిన రోడ్లకు గండి పడిందంటే అర్థముంది కానీ.. రెండు నెలల క్రితం గండి పడటమేమిటని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
               నగరం మండల కేంద్రం నుంచి కారంకివారిపాలెం వెళ్లే దారిలో రెండు నెలల క్రితం బీటీ రోడ్డు నిర్మించారు. అయితే ఈరోడ్డు మార్గంలో మూడుచోట్ల మురుగుతూములున్నాయి. ఇవి ఉన్న చోట కల్వర్టులు నిర్మించాలని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే అధికారులు మాత్రం షరా మామూలుగా వారి సూచనలు పట్టించుకోలేదు. వారం రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండంతో.. బీటీరోడ్డులో మురుగుతూములు ఉన్నచోట.. రోడ్డు కోతకు గురై గండి పడింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
                   పంటకాలువపై అడ్డంగా చెట్లు వేసి కేవలం పాదచారులు మాత్రమే రాకపోకలు సాగించగలుగుతున్నారు. ఈ రోడ్డులో ఇంకా రెండుచోట్ల తూములున్నాయని, అక్క కూడా రోడ్డు కోతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులను ఎవరూ నియంత్రించలేకపోయినా.. కోరి విపత్తులను కొనితెస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment