Saturday, November 28, 2015

చేనేత రుణమాఫీకి సవాలక్ష ఆంక్షలు

రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతల్ని అపహాస్యం చేసేలా నిబంధనలు విధించిన ఏపీ సర్కారు.. తాజాగా నేతన్నలకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా చేనేత రుణమాఫీ ఊసెత్తని బాబు సర్కారు.. ఇప్పుడు బ్యాంకులకు విడుదల చేసిన మార్గదర్శకాలు చూసి చేనేత కార్మికులకు కళ్లు తిరుగుతున్నాయి.
        చేనేత కార్మికుడు ఇప్పటికీ అదేవృత్తిచేస్తుండాలని, చనిపోయిన కార్మికుడికి రుణమాఫీ వర్తించదని, అతడి కుటుంబంలో డ్వాక్రా, వ్యక్తిగత రుణాలు తీసుకున్నా చేనేత మాఫీ వర్తించదని కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని మదనపల్లె, తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి, నగరి ప్రాంతాల్లో యాభై వేల మంది చేనేత కార్మికులున్నారు.
        సర్కారు తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం తొంభై శాతం మందికి రుణమాఫీ కాదని అధికారులు తేల్చేస్తున్నారు. అయితే సర్కారు రూల్స్ పై చేనేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేనేత రంగాన్ని దివాళా తీయించిన సర్కారు.. ఇప్పుడు రుణమాఫీ నిబంధనల పేరుతో మరోసారి నేత కార్మికుల జీవితాలను అపహాస్యం చేస్తోందని మండిపడుతున్నారు.

No comments:

Post a Comment