Thursday, November 26, 2015

రైతు బంధుతో ఫలితం శూన్యం

మార్కెట్ కమిటీలు రాజకీయ పునారావాస కేంద్రాలుగా మారాయి. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేవరకు మార్కెట్ యార్డుల్లో నిల్వచేయడానికి సదుపాయం ఉండాలి. నిల్వ చేసిన ధాన్యంపై రైతు బంధు పథకం కింద నామమాత్రపు వడ్డీకి రుణాలివ్వాలి, కానీ పచ్చచొక్కాల పుణ్యమా అని రైతు బంధు పథకం కూడా తెలుగుతమ్ముళ్ల మయమైపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న కృష్ణా జిల్లాలో కూడా పథకం తప్పుదోవ పడుతోంది.
            మార్కెట్ కమిటీల పరిధిలో ఆరు నుంచి ఏడు మండలాలు ఉంటున్నాయి. మార్కెట్ కమిటీ ఏర్పాటు సమయంలో మండలాలను పరిగణలోకి తీసుకుంటున్న సర్కారు.. తర్వాత ఛైర్మన్, కార్యదర్శితో పని జరిపించేస్తోంది. వీరు సభ్యులను సంప్రదించకుండా ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. దీంతో చాలామంది లబ్ధిదారులకు రైతుబంధు పథకం అందడం లేదు.
              కృష్ణా జిల్లాలో కేవలం రెండు వేల మంది రైతులకే రైతుబంధు పథకం కింద రుణం అందుతోంది. వీరు కూడా అధికారపార్టీలో ప్రాబల్యం ఉన్న బడారైతులు, భూస్వాములే అనేది బహిరంగ రహస్యం. అదేమంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అంతే అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులను ఉద్ధరిస్తామని గొప్పలు చెబుతున్న సర్కారు ఆచరణ ఎంత బాగుందో మార్కెట్ యార్డులను చూస్తే అర్థమాతోంది. 

No comments:

Post a Comment