Monday, November 30, 2015

ప్రభుత్వ ఉద్యోగులకే సుఖం లేదు

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమం మాటేమో గానీ.. ఉద్యోగులకే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా అందరూ సుఖమైనదిగా భావించే ప్రభుత్వోద్యాగాన్ని కూడా పచ్చచొక్కాలు ప్రత్యక్ష నరకంగా మార్చేశారు. తమదైన రాజకీయ పద్ధతుల్లో సంక్షేమ పథకాలు అమలు చేయాలని కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం, ఎదురుతిరిగిన వారిని శంకరగిరిమాన్యాలు పట్టించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
          సాక్షాత్తు సీఎం సొంత జిల్లా చిత్తూరులోనే గత ఏడాది కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. గతంలో కూడా ఉద్యోగ వ్యతిరేక సీఎంగా ముద్రపడ్డ చంద్రబాబు. ఇప్పుడు మరోసారి తన విశ్వరూపం చూపిస్తున్నారని ఉద్యోగులు భావిస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లు చేయడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పినా.. ఉన్నతాధికారులు వేధిస్తున్నారని వాపోతున్నారు.
          టీడీపీ హయాంలో అధికార పార్టీ అండ చూసుకుని కొందరు ఉన్నతాధికారులు కూడా రెచ్చిపోవడం అనవాయితీ అయిపోయింది. సీఐలు ఎస్సైలను బూతులు తిట్టడం, ఎస్సైలు కిందిస్థాయివారిపై కోపం చూపించడం, రెవిన్యూ శాఖలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లు, కారుణ్య నియామకాల కోసం అడిగితే దారుణమైన మాటలు ఇవన్నీ చిత్తూరు జిల్లాలో కామన్ సీన్. సీఎం ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే టీడీపీకి సొంత జిల్లాలో ఘోర పరాభవం తప్పదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment