Sunday, November 8, 2015

ముద్రగడ ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు

కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, కాపు సంక్షేమానికి ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామన్న ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరుతూ.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి కాపు నేతలు సంఘీభావం తెలిపారు. కోనసీమతో పాటు పలు ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి భారీగా కాపులు తరలివచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు సాధించుకోలేకపోతే భవిష్యత్తులో కాపులు దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముద్రగడ ఆందోళన వ్యక్తం చేశారు.
  ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటామని ముద్రగడ హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు మోసపూరిత హామీలిచ్చారని, ఈసారి వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. కాపు కార్పోరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి,, కేవలం వంద కోట్లే విదిలించారని ముద్రగడ గుర్తుచేశారు. కాపులపై చంద్రబాబు కపటప్రేమను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
   కాపు ఉద్యమ కార్యాచరణను నిర్ణయించడానికి జనవరి 31న భారీ బహిరగం సభ ఏర్పాటుచేస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ సభకు కాపులంతా పెద్దఎత్తున తరలివచ్చి.. ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలని కోరారు.

No comments:

Post a Comment