Thursday, November 19, 2015

నిధులున్నా నీరసం

మహిళలకు తొలిసారి స్వయంసహాయ సంఘాలను పరిచయం చేసింది తానేనని గొప్పలు చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో స్త్రీశక్తికి నిరాదరణ దక్కుతోంది. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన స్త్రీశక్తి భవానాల నిర్మాణం నాలుగేళ్లైనా అతీగతీ లేదు. పోనీ కాంగ్రెస్ వాళ్లు అవినీతి చేశారనుకున్నా.. కనీసం తమ హయాంలో అయినా పూర్తవ్వాలి కదా.. అంటే టీడీపీ నేతల దగ్గర సమాధానం లేదు.
                 పశ్చిమగోదావరి జిల్లాలో మండలానికొకటి చొప్పున స్త్రీశక్తి భవనాలు మంజూరయ్యాయి. ముందుగా భవనానికి 25 లక్షల చొప్పున కేటాయించారు. తర్వాత రేట్ల పెరగడంతో.. అదనంగా అన్ని భవనాలకు కలిపి 1.40 కోట్లు విడుదలయ్యాయి. అయితే పుష్కలంగా నిధులున్నా.. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ లోపించడంతో.. వారి ఇష్టారాజ్యం అయిపోయింది.
                ఏపీ విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ హయాంలో అవినీతి మరింత పొంగి పొర్లుతోంది. అందర్నీ అవినీతిపరులని తిట్టే తెలుగు తమ్ముళ్లు.. తాము మాత్రం అవినీతి సామ్రాట్టులుగా పేరు తెచ్చుకుంటున్నారు. స్త్రీశక్తి భవనాల్లో సగం చోట్ల తుదిదశలో ఉండగా..  మిగతా చోట్ల మాత్రం పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. డ్వాక్రా సంఘాలు మొత్తుకుంటున్నా సర్కారు నిర్లక్ష్యం వహించడంతో.. స్త్రీశక్తి కాగితాలకే పరిమితమౌతోంది. 

No comments:

Post a Comment