కరవుతో అల్లాడుతున్న రైతులకు పాడిపరిశ్రమ కూడా దన్నుగా నిలవలేకపోతోంది. పశువులకు వైద్యం చేయించాల్సిన సర్కారు.. డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఏపీలోని కడప జిల్లాలో పశువు కాపరుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పేరుకు పశువుల ఆస్పత్రులు చాలానే ఉన్నా.. అక్కడ సిబ్బంది మాత్రం ఉండటం లేదు.
జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మినహా మిగతా చోట్ల పశువుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోగాలతో అల్లాడి పశువులు ప్రాణాలు కోల్పోతున్న సర్కారు చోద్యం చూస్తోంది. చాలా ఆస్పత్రుల్లో సిబ్బంది లేరు. సిబ్బంది ఉన్నా మందులు, శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో లేవు. ఇవి రెండూ ఉంటే వైద్యసిబ్బంది సొంత పనులు చేసుకుంటూ పశువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
అధికారులను అదిలించాల్సిన సర్కారు కూడా సాధ్యమైనంత అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. పశుసంవర్థక శాఖలో అమల్లో ఉన్న వివిధ పథకాలకు మంగళం పాడింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లైంది. రైతులు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాలని చెబుతున్న ఏపీ సర్కారు.. తాను చేయాల్సిన పనులు మాత్రం గాలి కొదిలేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మినహా మిగతా చోట్ల పశువుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోగాలతో అల్లాడి పశువులు ప్రాణాలు కోల్పోతున్న సర్కారు చోద్యం చూస్తోంది. చాలా ఆస్పత్రుల్లో సిబ్బంది లేరు. సిబ్బంది ఉన్నా మందులు, శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో లేవు. ఇవి రెండూ ఉంటే వైద్యసిబ్బంది సొంత పనులు చేసుకుంటూ పశువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
అధికారులను అదిలించాల్సిన సర్కారు కూడా సాధ్యమైనంత అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. పశుసంవర్థక శాఖలో అమల్లో ఉన్న వివిధ పథకాలకు మంగళం పాడింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లైంది. రైతులు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాలని చెబుతున్న ఏపీ సర్కారు.. తాను చేయాల్సిన పనులు మాత్రం గాలి కొదిలేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
No comments:
Post a Comment