Monday, November 16, 2015

తుంగభద్రకు సర్కారు తూట్లు

అనంతపురం జిల్లాకు వరప్రదాయిని అయిన తుంగభద్రా నది నీళ్లు తేవడంలో అధికార పార్టీ నేతలు విఫలమయ్యారు. పెన్నహోబిలం డ్యామ్ నుంచి అదనపు వాటా సాధించడంలో విపలమైన జిల్లా టీడీపీ నేతలు.. హంద్రీ - నీవా ద్వారా వచ్చిన 2.3 టీఎంసీలతోనే జిల్లాలో చెరువులన్నీ నింపాలని అధికారులకు హుకుం జారీ చేశారు. అయితే జిల్లాలో మొత్తం 49 నుంచి 60 వరకు చెరువులున్నాయని, వీటన్నింటినీ నింపాలంటే కనీసం 5 టీఎంసీలు నీళ్లు కావాలని అధికారులు అంటున్నారు.
                   దివంగత నేత వైఎస్ హయాంలో పెన్నహోబిలం డ్యామ్ నుంచి అనంతపురం జిల్లాకు పది టీఎంసీల నీళ్లు అదనంగా కేటాయించారు. అయితే చంద్రబాబు సర్కారు వైఎస్ ఇచ్చిన జీవోకు తూట్లు పొడిచి అనంతకు మొండిచేయి చూపింది. దీంతో హంద్రీ నీవా ద్వారా వచ్చే అరకొర నీటితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడలేని అధికార పార్టీ పెద్దలు.. తమపై ఒత్తిడి తెస్తున్నారని అధికారులు వాపోతున్నారు.
              గతంలో ఓసారి 4.5 టీఎంసీలు ఇచ్చినా కూడా కేవలం 60 శాతం చెరువులే నిండాయి. అలాంటిది ఇప్పుడు 2.3 టీఎంసీల నీటితో అన్ని చెరువులు నింపడం సాధ్య కాదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లాలోనే టీడీపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. అయితే అధికార పార్టీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తోంది జనం మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment