Tuesday, November 24, 2015

అనంత జడ్పీలో స్తబ్ధత

అనూహ్యంగా అనంతపురం జడ్పీ ఛైర్మన్ పదవి దక్కించుకున్న చమన్ కు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పదవిలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆయన ముళ్లకిరీటం నెత్తిమీద ఉన్నట్లే ఫీలవుతున్నారు. పైగా పార్టీ ఒప్పందం ప్రకారం కేవలం రెండున్నరేళ్లే చమన్ పదవిలో ఉంటారు. ఇప్పటికే పద్దెనిమిది నెలలు గడిచాయి. ఇంకా పన్నెండు నెలలు మాత్రమే వ్యవధి ఉంది. అయితే జడ్పీకి రాష్ట్ర ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో.. ఎవరూ ఏ పనులు అడిగినా చేయలేని పరిస్థితిలో చమన్ ఉన్నారు.
               జడ్పీలకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపేయడంతో.. రాష్ట్రానికి కేటాయించే నిధులను జడ్పీకి మళ్లించాలని చమన్, జిల్లా మంత్రులను కోరారు. ఇంతవరకూ దానికి అతీగతీ లేదు. మొన్న రెండు కోట్ల రూపాయల నిధులు వచ్చినా అవి సిబ్బంది జీతాల ఖర్చుకే సరిపోయాయని అంటున్నారు. మంత్రులెవరూ తనకు సహకరించకపోవడంతో జడ్పీ సమావేశాల్లో ప్రతిపక్షానికి కూడా జవాబు చెప్పుకోలేకపోతున్నామని చమన్ లోలోపల మథనపడుతున్నారు.
            జిల్లా మంత్రి పరిటాల సునీత కూడా చమన్ ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. చమన్ ఎదిగితే చేయి దాటి పోతాడని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన చమన్. సాయం చేయమని సునీతను అడిగినా ఆమె స్పందిండం లేదు. దీంతో మరింత స్తబ్ధుగా మారిన చమన్.. ఎక్కువగా బెంగళూరు, అమరావతిలో రియల్ ఎస్టేట్ చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. అధికార పార్టీ ముఠా తగాదాల్లో జిల్లా ప్రజలకు నష్టం జరుగుతోందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

No comments:

Post a Comment