Tuesday, November 17, 2015

బాక్సైట్ జీవో రద్దు తాత్కాలికమా..? శాశ్వతమా..?

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వాకలను నిలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా జీవో రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు ఇవ్వకపోవడంతో పాటు.. పనులు ఆపేయాలని మాత్రమే సీఎం అన్నట్లు వార్తలు రావడంతో.. సందేహాలు మొదలయ్యాయి. జీవో రద్దు తాత్కాలికమా, శాశ్వతమా అని ఉద్యమకారులు చర్చించుకుంటున్నారు. 
                   ప్రస్తుతానికి పనులు ఆపేయాలని సీఎం ఉత్తర్వులు ఇవ్వడం ఉద్యమ విజయమేనని, అయితే టీడీపీ సర్కారును నమ్మడానికి వీల్లేదని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఉద్యమ కమిటీ తీర్మానించింది. పైకి జీవో రద్దు చేశామని చెప్పి, ఏ అర్థరాత్రో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపే అవకాశం ఉందని అనుమానాలు వస్తున్నాయి. చంద్రబాబు గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని తీర్మానించారు. 
                   ఏజెన్సీలో ఉన్న విలువైన బాక్సైట్ గనులపై కన్నేసిన బడాబాబులు సర్కారుపై ఒత్తిడి తెచ్చి తవ్వకాలకు అనుమతులు తెచ్చుకున్నారు. వీరికి కొందరు ప్రభుత్వపెద్దలు కూడా వత్తాసు పలుకుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉద్యమవేడి కారణంగా తవ్వకాలు నిలిపేసినా, పరిస్థితి సద్దుమణిగాక చూసుకుందామనే ధోరణిలో బడాబాబులు ఉన్నట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment