Saturday, November 14, 2015

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే తనయుడి ఘనకార్యం

ఇతరులకు శ్రీరంగనీతులు చెబుతారు కానీ.. తనయుడు వేస్తున్న రోడ్డులో లోపాలు కనిపించడం లేదా.. అని  మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై.. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి మండిపడ్డారు. ప్రొద్దుటూరు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డి కాంట్రాక్టు తీసుకుని రోడ్డు వేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణం నాసిరకంగా ఉంటోందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు రాచమల్లు ప్రసాదరెడ్డి రంగంలోగి దిగారు. 
            క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డును పరిశీలించిన వైసీపీ నేతలకు.. స్థానికులు చేస్తున్న ఫిర్యాదులు చాలా తక్కువని తేలింది. అసలు రోడ్డు నిర్మాణంలో ఎవరైనా తారు వాడతారు. కానీ కొండారెడ్డి మాత్రం తారే వాడటం లేదన్న విషయం నేతల దృష్టికి వచ్చింది. కంకరకు నల్లరంగు వేసి మాయ చేస్తున్నారని, తారు కంటే ఆయిల్ ధర తక్కువగా ఉండటమే దీనికి కారణమని పరిశీలనలో తేలింది. 
               అధికార పార్టీ నేతలు రోడ్లు కాంట్రాక్టుకు తీసుకుంటే పనులు ఇలాగే ఉంటాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఈ విధంగా దోచుకుతింటున్నారని విమర్శించారు. వరదరాజులరెడ్డికి దమ్ముంటే తనయుడికి బుద్ధి చెప్పి నాణ్యమైన రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు. నిప్పులాంటి మనిషినని చెప్పుకునే సీఎం చంద్రబాబు.. ప్రొద్దుటూరు రోడ్డు చూసి అవినీతి జరగలేదని గుండె మీద చేయ్యేసుకుని చెప్పగలరా అని సవాల్ విసిరారు. 

No comments:

Post a Comment