Saturday, November 14, 2015

పశ్చిమలో ఆక్వా సెగలు

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ తలపెట్టిన ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా జనం గొంతెత్తారు. ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా భీమవరం మండల జొన్నలగరువులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు.. భారీగా తరలివచ్చారు. అవసరమైతే జైలుకైనా వెళ్తాం కానీ.. చంద్రబాబును ఫుడ్ పార్క్ కు శంకుస్థాపన చేయనీయమని తేల్చి చెబుతున్నారు.
             ఎక్కడో నివాసాలకు దూరంగా, సముద్రతీరంలో ఏర్పాటుచేయాల్సిన ఆక్వా ఫుడ్ పార్కును, నివాసప్రాంతాలు, పొలాల మధ్యలో ఏర్పాటుచేయడంపై నిరసన వ్యక్తమౌతోంది. ఆక్వా ఫుడ్ పార్క్ లో భారీగా అమ్మోనియం వాడతారని, దీని కారణంగా సమీప ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు విషపూరితమై, వ్యర్థాలన్నీ గొంతేరు డ్రైయిన్లో కలిసి.. సమీప గ్రామాల ప్రజలు రోగాల బారిన పడతారని ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ఆందోళన చెందుతోంది.
              ఈ నెల 17న శంకు స్థాపనకు వస్తున్న చంద్రబాబును అడ్డుకుంటామని స్థానిక మహిళలు చెబుతున్నారు. సీఎం తమ ఊరు వస్తే మంచి చేయడానికి రావాలని, అంతేగానీ అందరూ తాగే మంచినీళ్లను విషపూరితం చేస్తామంటే ఒప్పుకోబోమని తెగేసి చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని సీట్లూ తెలుగుదేశానికి ఇచ్చింది.. అభివృద్ధి చేస్తారనే గానీ.. తమ పొలాలు నాశనం చేయడానికి కాదని దెప్పిపొడుస్తున్నారు. 

No comments:

Post a Comment