Monday, November 16, 2015

తోకముడిచిన తాండవాసురులు

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో ఇసుకాసురులు తోక ముడిచారు. తాండవ నదీగర్భంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాజా క్షేత్రస్థాయి తవ్వకాలపై సాక్ష్యాలు ఇవ్వడంతో.. నివేదిక ఇవ్వాల్సిందిగా హైకోర్టు అధికారులను ఆదేశించింది. తనిఖీల కోసం అధికారులు వస్తున్నారని సమాచారం తెలిసిన ఇసుకాసురులు అక్కడ్నుంచి జారుకున్నారు.
                తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు, తుని రూరల్, తుని పట్టణ పరిధిలో తాండవ నది ప్రవహిస్తోంది. తాండవ నది రిజర్వాయర్ నుంచి అరవై ఐదు వేల మంది ప్రజలకు నీళ్లు అందుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయి, పంటభూములు కోతకు గురవుతున్నాయి. అక్రమాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో.. దాడిశెట్టి రాజా నేరుగా కోర్టును ఆశ్రయించారు.
             విశాఖ జిల్లా నాతవరం మండలంలోని తాండవ ప్రాజెక్టు నుంచి తుని మీదుగా పెంటకోన వరకు తాండవ నది ప్రవహిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక తాండవ నదీ గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటిందని చెబుతున్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న పచ్చ చొక్కాలు.. సహజవనరులను కూడా వదలడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment