Friday, November 13, 2015

ఇన్ పుట్ సబ్సిడీకి దిక్కులేదు

ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలు పండించే రైతుల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యం పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోగా.. తర్వాతి పంటకు విడుదలైన ఇన్ పుట్ సబ్సిడీని ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. జిల్లాలకు విడుదల చేశామని ప్రభుత్వం చెబుతుంటే.. అధికారులు మాత్రం సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు.
            అనంతపురం జిల్లా ఇన్ పుట్ సబ్సిడీ కోసం రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. వ్యవసాయ శాఖ జాయింట్ డైరక్టర్ తో వాగ్వాదం పెట్టుకున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తే.. మీకేం ఇబ్బందని నిలదీశారు. వారం రోజుల్లో ఇస్తామని జాయింట్ డైరక్టర్ చెప్పినా.. ఇలా చాలాసార్లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అధికారులు రైతుల్ని మభ్యపెట్టడంలో చంద్రబాబును మించిపోయారని మండిపడ్డారు. రైతులపై ఎలాగో సర్కారుకు చిన్నచుపే కాబట్టి.. ఇచ్చినా.. ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లుగా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారు.
            అనంతపురం జిల్లాలకు 500 కోట్ల పైచిలుకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదలైందని, దీన్ని రైతుల ఖాతాల్లో ఎందుకు వేయలేదన్న ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. చివరకు కలెక్టర్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి వారం రోజుల్లో వేస్తామని తూతు మంత్రపు హామీ ఇచ్చారు. వారం రోజుల తర్వాతైనా రైతు ఎకౌంట్లో డబ్బు పడుతుందో లేదో అనుమానమేనని రైతు సంఘాలు నేతలు చెబుతున్నారు. 

No comments:

Post a Comment